ప్రభాస్ పై అభిమానులకు ఇంట్రెస్ట్ తగ్గిందా.. అందుకే యూట్యూబ్ వ్యూస్ తగ్గాయా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "రాదే శ్యామ్".

యూరప్ లో జరిగే ఒక పిరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించగా పూజా హెగ్డే మాత్రం ప్రేరణ అనే పాత్రలో కనిపించనున్నారు.ఈక్రమంలోనే సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసారు.గత రెండు సంవత్సరాల నుంచి ప్రభాస్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ టీజర్ విడుదల చేయడంతో పండగ చేసుకున్నారు.

అయితే ప్రభాస్ సినిమా నుంచి టీజర్ విడుదల కావడంతో వ్యూస్ పరంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు నిర్వాహకులు.అయితే ఈ టీజర్ వ్యూస్ ఉన్నఫలంగా తగ్గడంతో ప్రభాస్ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప్రభాస్ పై అభిమానం తగ్గిందా.అందుకే వ్యూస్ తగ్గాయా అంటూ అనుమానాలను వ్యక్తం చేశారు.

ఒకేసారి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తగ్గిపోవడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ విషయంలో ఇలా జరగడంతో అభిమానులు ఏకంగా యూట్యూబ్ టీమ్ ను అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నించారు.ఈ క్రమంలోని యూట్యూబ్ నిర్వాహకులు స్పందిస్తూ.యూట్యూబ్ ను వ్యాలీడేట్ చేశామని, ఈ క్రమంలోనే ఏదైనా వీడియోల పై అప్పటివరకు ఉన్న వ్యూస్ తగ్గడం, లేదా ఉన్న వ్యూస్ ఫ్రీజ్ కావడం జరుగుతుందని నిర్వాహకులు సమాధానం చెప్పడంతో అభిమానులు కాస్త శాంతించారు.

ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కావడంతో అంచనాలు పెట్టుకొని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు