బోయిన్ పల్లిలో రాష్ట్ర ఐజేయు పిలుపు మేరకు పోస్ట్ కార్డు ఉద్యమం.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి( Boinpalle ) మండల కేంద్రంలో రాష్ట్ర ఐ జే యు పిలుపుమేరకు మంగళవారం రోజున మండల ఐ జే యు అధ్యక్షుడు పట్నం ప్రసాద్ ఆధ్వర్యంలో ఐ జే యు యూనియన్ సభ్యులు అందరూ కలిసి పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు పోస్ట్ కార్డ్ ద్వారా సమస్యలను తెలియజేశారు.

అనంతరం మండల అధ్యక్షుడు పట్నం ప్రసాద్( Prasad ) మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ లు పోషించిన భూమిక అత్యంత కీలకమైనది.

అనేక మార్లు ప్రశంసించారు.ఉద్యమ నేతగానూ, ఆ తర్వాత ముఖ్యమంత్రి గానూ జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని మనవి చేస్తున్నాం.

అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు.అకస్మాత్తుగా అనారోగ్యాలకు గురవుతున్న జర్నలిస్టులు చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు.

మరి కొందరు వైద్యం కోసం అప్పుల పాలవుతున్నారు.జె హెచ్ ఎస్ కింద అందించిన హెల్త్ కార్డులు( Health cards) అమలయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో శరత్ కాసరపు శ్రీదర్ గౌడ్, శ్ కూసరవి, సావనపల్లి గణేష్ లు ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News