పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో మంజూరైన పనుల వివరాలు ఇప్పటి దాకా ఎన్ని మంజూరు అయ్యాయి, ఎన్ని పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.(ఎం.ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్.) ఉపాధి హామీ పథకం కింద ఎన్ని గ్రామపంచాయతీ భవనాలు నిర్మించారు? ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి?, అమ్మ ఆదర్శ పాఠశాలల కింద విద్యాలయాల్లో ఎన్ని పనులు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు.పంచాయతీరాజ్ శాఖ కింద మొదలు పెట్టిన రోడ్స్ , ఇతర నిర్మాణ పనులలో వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశం లో పంచాయతీరాజ్ శాఖ ఈఈ సూర్య ప్రకాష్, డీ.ఈ.లు.శ్రీనివాస్, సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, పవన కుమారి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలు తీసుకెళ్లండి
Advertisement

Latest Rajanna Sircilla News