ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న రాత్రి హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో భేటీ అయ్యారు.దాదాపు ఇద్దరిమధ్య అరగంట పాటు చర్చలు జరిగాయి.
చర్చల్లో ఎక్కువగా తిరుపతి ఉప ఎన్నిక ఉమ్మడి అభ్యర్థి ఎన్నిక విషయం గురించి చర్చించినట్లు సమాచారం.ఎన్నికలకు ఎవరు పోటీ పడిన కానీ ఆ రెండు పార్టీల నాయకులు.
తిరుపతి ఉప ఎన్నిక విజయం కోసం కృషి చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా భేటీ అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెండు పార్టీలు సంయుక్తంగా పనిచేసే అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు.ఇందుకుగాను తిరుపతి ఉప ఎన్నిక నే పునాదిగా భావిస్తున్నట్టు స్పష్టం చేశారు.
కుల మరియు మత వర్గాల బేధాలు
లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలసి పని చేద్దాం అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.ముఖ్యంగా ఇటీవల తిరుపతి లో పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు గ్యాప్ వచ్చినట్లు స్పష్టం చేయడంతో.
గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికే ఈ భేటి జరిగిందని తెలుస్తోంది.మొత్తంమీద తెలుగు రాజకీయాల్లో పవన్ సోము వీర్రాజు భేటీ కొత్త పరిణామాలకు దారితీస్తుందని అంటున్నారు.