ఓరుగల్లులో కొత్త రగడ.. ఈ సమస్యకు ఇంకెన్ని మలుపులో.. ?

తెలంగాణ, ఏపీలో రాజకీయ యుద్ధాలు ఎప్పుడు ఆగిపోతాయో ఏమో తెలియదు గానీ ఏదో ఒక విషయం లో రాజకీయ రచ్చ మాత్రం తరచుగా జరుగుతూ ఉంటుంది.

ఇక తెలంగాణాలోని వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో ఓరుగల్లులో కొత్త రగడ తెరపైకి వచ్చింది.

కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్షకు గుర్తుగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవరణలో 10 లక్షలతో పైలాన్‌ ఏర్పాటు చేశారు.ఈ పైలాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నాలుగైదు రోజుల్లోనే ఆ పని పూర్తి కావడం.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌లు దీక్షా దివస్‌ పైలాన్ ను ఆగమేఘాలపై ఆవిష్కరించడం జరిగిపోయింది.ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం అధికారపార్టీ రాజకీయాలను ఈ దీక్షా దివస్‌ పైలాన్‌ వేడెక్కిస్తోంది.

కాగా ఈ పైలాన్‌ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏకపక్షంగా నిర్వహించారని కొందరు గుర్రుగా ఉండగా, మరి కొందరు తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఇలా ఎవరికి వారు నిరసన స్వరాలు వినిపిస్తున్నారట.ఇక త్వరలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ సమస్య ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలని అనుకుంటున్నారట కొందరు నేతలు.

Advertisement
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తాజా వార్తలు