తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.డీఎస్పీ ప్రమోషన్ల అంశంపై జగ్గారెడ్డి స్పందించారు.

26 ఏళ్ల క్రితం సబ్ ఇన్ స్పెక్టర్లు విధుల్లో చేరారన్న జగ్గారెడ్డి ఇన్ని సంవత్సరాలలో ఒకే ప్రమోషన్ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు.వంద మందికి డీఎస్పీ ప్రమోషన్ ఇవ్వాలని కోరారు.

మూడేళ్లుగా అధికారులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించి చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి లేఖలో కోరారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు