విద్యార్థులకు టై, బెల్ట్, ఐడికార్డ్ ల పంపిణి చేసిన స్వామి వివేకానంద సేవాసమితి సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా పాఠశాలలో చేరిన 6 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద సేవాసమితి మల్యాల వారు ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో టై, బెల్ట్, ఐడికార్డ్స్ అందించారు.

ఈ సందర్భంగా స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే జిల్లా పరిషత్ పాఠశాలలో చేరిన ఆరవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా టై,బెల్ట్, ఐడికార్డ్ లను అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర,టీచర్స్ అమర్ నాథ్, రవీందర్, తిరుపతి, లావణ్య, స్వర్ణలత, మమత లావణ్య స్వామి వివేకానంద సేవాసమితి సభ్యులు పాటి సుధాకర్, పంచెరుపుల దివ్యసాగర్, దుర్శెట్టి రాజు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన పసుల కృష్ణ

Latest Rajanna Sircilla News