మాణిక్యం ఠాగూర్ పై వేటుతో.. కాంగ్రెస్ పుంజుకుంటుందా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఎప్పుడు నేతల మద్యన అంతర్గత కుమ్ములాట నిత్యకళ్యాణం పచ్చ తోరణం అనేలా ఉంటాయి.అధికారం లో ఉన్నా.

ప్రతి పక్షంలో ఉన్నా.నేతలు మాత్రం ఒకేలా విమర్శించు కుంటు ఉంటారు.

అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో.హోదాలను పట్టించుకోకుండా విమర్శలు చేసుకుంటారు.

తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ తీసుకున్న దగ్గరి నుంచి పార్టీ లో ముసలం మొదలైంది.సీనియర్లు జూనియర్లు గా విడిపోయారు.

Advertisement

ఇక కోమటి రెడ్డీ రాజగోపాల్ రెడ్డి పార్టీని విడిచి పోతే.పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ.

కోమటి రెడ్డి వెంకట రెడ్డీ కాంగ్రెస్ కు పోటు పొడిచాడు.మిగిలిన సీనియర్లు మాత్రం రేవంత్ పై డైరెక్ట్ గా విమర్శలు చేయకుండా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు.

వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అప్పటి ఇంచార్జ్ మాణిక్యం టాకుర్ సీనియర్లను పక్కన పెడుతూ వచ్చారు.అదే టైమ్ లో రేవంత్ దగ్గర కావడం తో.వారిద్దరూ కలిసి పార్టీ బుజాన వేసుకున్నారు.

సీనియర్లను అటు అధ్యక్షుడు, ఇటు ఇంచార్జ్ పట్టించుకోక పోవడం తో అసమ్మతి లేవనెత్తి.టాగూర్ నీ గోవాకు సాగనంపారు.ఇక్కడిదాకా బాగానే ఉన్నా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

వచ్చే అధ్యక్షుడు టాక్రే ఆయనకంటే మొండి గటం.పెనం మీద నుంచి పొయ్యిలో పడి నట్టు అయింది సీనియర్లు పరిస్థితి.కొత్త అధ్యక్షుడు వచ్చినా కలిసి వచ్చేది మాత్రం రేవంత్ రెడ్డీ కే అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

దానికి కారణం అధిష్టానానికి అయన పై ఉన్న నమ్మకం.దాంతో ఇంచార్జీ ను మార్చిన తర్వాత అయిన పార్టీ పుంజుకుంటుందా.? లేదా చూడాలి.

తాజా వార్తలు