పక్షవాతం రూపంలో పెద్ద కష్టం - మానస కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్( Double bedroom ) లో నివసిస్తున్న ఓ పేద కుటుంబానికి పక్షవాతం రూపంలో పెద్ద కష్టం వచ్చింది.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గౌరీ( Gauri ) గారి మానసకు ఒక్కసారిగా పక్షవాతం రాగా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించగా జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో ఉన్నట్టుండి భార్యకు పక్షవాతం రాగా చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్న హస్తం కొరకు ఎదురు చూస్తున్నాడు.సమాచారం అందుకున్న దోస్త్ యూత్ సభ్యులు మంగళవారం మానస భర్త సతీష్ కు 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు ఎవరైనా ఉంటే మానవత దృకృతంతో స్పందించి ఆర్థిక సహాయం ఫోన్ పే 7993871392 కు అందజేయాలని అన్నారు.చందనం శివరామకృష్ణ, ధ్యాగం శ్యామ్,ఈసరి కిరణ్, మేగీ రాజు, ధ్యాగం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News