బాలయ్య కోసం మాస్ రాజా తప్పుకుంటాడా?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.

ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఖిలాడి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 28న రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.అయితే అదే సమయంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ(BB3)ని కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

చాలా రోజుల తరువాత బాలయ్య-బోయపాటి కాంబోలో చిత్రం రానుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

దీంతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య-రవితేజలు ఢీకొంటుండటంతో ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా బాక్సాఫీస్ వద్ద క్లాష్‌ను తప్పిస్తే, రెండు సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టవచ్చని భావించిన రవితేజ అండ్ టీమ్, తమ ఖిలాడి చిత్ర రిలీజ్‌ను వాయిదా వేయాలని చూస్తున్నారు.

మే 28న కాకుండా జూన్ నెలలో ఖిలాడి చిత్రాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో మే 28న బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఖిలాడి చిత్రంలో రవితేజ సనసన అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు నటిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు