ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించాం..: ఏపీ సీఈవో ఎంకే మీనా

టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.ఇటీవల టీడీపీ ఇచ్చిన వినతిపత్రంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఈవో ఎంకే మీనా ప్రత్యుత్తరం పంపారు.

ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించామని సీఈవో ఎంకే మీనా పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని తెలిపారు.

ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డ 19 మందిపై కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్వోలు, పర్చూరు ఏఈఆర్వో, సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని తెలిపారు.

అదేవిధంగా యాభై మంది వరకు బీఎస్ఓలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.

Advertisement
అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు