ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ఆరోజే ఫ్యాన్స్ కు భారీ సర్ప్రైజ్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎన్నో ఆటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఈమె ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

మార్చి 6వ తేదీన ఈ సినిమా నుంచి భారీ సర్ప్రైజ్ రానుందని సమాచారం అందుతోంది.మార్చి నెలలో ఈ సినిమాకు సంబంధించి వరుస సర్ప్రైజ్ లు రానున్నాయని సమాచారం అందుతోంది.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా మార్చి 6వ తేదీన జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో ఆరోజే జాన్వీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది.జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ కొరటాల కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి జాన్వీకి టెస్ట్ షూట్ పూర్తైంది.మార్చి నెల మూడో వారంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది.మార్చి నెల చివరి వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా తారక్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

Advertisement

తారక్ ఈ సినిమా కథలో మార్పులు చెప్పారని తారక్ చెప్పిన మార్పులకు అన్గుణంగానే ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు