పల్లిమక్త గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం!

రాజన్న సిరిసిల్ల జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిభిరం కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో నిర్వహించారు.

ఈ పశు వైద్య శిబిరానికి గ్రామ సర్పంచ్ అనిల్, విజయ డైరీ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఈవో డి ఎల్ డి ఏ కరీంనగర్ డాక్టర్ శ్రీధర్,పశు వైద్య సిబ్బంది, కనక లక్ష్మి తిరుపతి రెడ్డి డి ఎల్ డి ఏ సిబ్బంది గోపాలమిత్ర సూపర్వైజర్ రాములు, గోపాలమిత్రులు శ్రీకాంత్, శ్రీనివాస్,ప్రశాంత్, దినేష్ పాల్గొన్నారు.

ఈ శిబిరంలో 60 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స 30 దూడలకు నట్టల నివారణ మందులు, రైతులకు లింగ నిర్ధారిత వీర్యము ఉపయోగాలపై అవగాహన చేయనైనది.పాడి పశువులకు పశుగ్రాస ఆవశ్యకత మీద రైతులకు వివరించారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News