ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఇంద్రవెల్లి మండలం మెండపెల్లిలో ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు.

గ్రామంలోని ఓ ఇంటిలో ఏర్పాటు చేసిన భోజనం తిన్నవారికి వాంతులు, విరోచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు.గమనించిన స్థానికులు బాధితులను వెంటనే ఇంద్రవెల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

వీరిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న అధికారులు మెండపల్లిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు