క్షయ నిర్ములనకు కృషి చేయాలి డిప్యుటీ డి ఎం ఎచ్ ఒ డాక్టర్ శ్రీరాములు

రాజన్న సిరిసిల్ల జిల్లా :టీ బి ముక్త్ గ్రామపంచాయతీ కార్యక్రమంలో భాగంగా క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ ఒ డాక్టర్ శ్రీరాములు అన్నారు.

టీ బి ముక్త్ గ్రామ పంచాయతీ సిరిసిల్ల జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు.

శివంగాలపల్లి, సర్దాపూర్, కంచర్ల గ్రామాలను జిల్లా వైద్య బృందం సందర్శించి రికార్డులను పరిశీలించారు.గ్రామ పంచాయతీల ప్రతిపాదన లను జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పంపుతామని గ్రామపంచాయతీ లకు అవార్డులు అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ స్నేహ, డిపీపీఎం , రాజ్ కుమార్, పి ఎస్ సి, టిబి సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు,ఆశాలు గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News