గుంటూరు జిల్లా( Guntur District ) మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో నిర్వహించిన వైసీపీ వర్క్ షాప్ ముగిసింది.మేము సిద్ధం – బూత్ సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో నేతలకు బూత్ స్థాయిలో ఎన్నికల కార్యాచరణపై సీఎం జగన్( CM Jagan ) దిశానిర్దేశం చేశారు.
దాదాపు అన్ని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను వైసీపీ( YCP ) ఖరారు చేసిన సంగతి తెలిసిందే.చిన్న చిన్న మార్పులు తప్ప ఉన్న ఇంఛార్జులే అభ్యర్థులని సీఎం జగన్ తెలిపారు.
బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం అయిదారు సార్లు కలవండని పేర్కొన్నారు.మనం చేసిన, చేసే మంచి పనులు చెప్పండన్న సీఎం జగన్ బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయాలని సూచించారు.సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహారించాలని తెలిపారు.