ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈడీ కస్టడీ పొడిగింపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇద్దరు నిందితులకు కస్టడీ పొడిగింపు అయింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ కు మరో ఐదు రోజులపాటు కస్టడీని కోర్టు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఈడీ అధికారుల విజ్ఞప్తితో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

ఈ క్రమంలో కుంభకోణంకు సంబంధించి అన్ని విషయాలు రాబట్టే పనిలో మరో ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.హవాలా వ్యవహారాన్ని నడపడంలో అభిషేక్ రావు కీలక పాత్రధారని వెల్లడించారు.

కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !
Advertisement

తాజా వార్తలు