పెరుగులో ఉప్పు కలుపుకోవాలా.. లేక పంచదార కలుపుకోవాలో తెలుసా..?

ఏ సీజన్ అయిన ప్రజలు పెరుగు( Curd )ను ఆహారంతో పాటు తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో దీని డిమాండ్ మరింత పెరుగుతుంది.

కొంత మంది పెరుగును చక్కెరతో మరి కొంత మంది ఉప్పుతో రుచి చూస్తూ ఉంటారు.అదే సమయంలో పెరుగులో ఏమి కలపకుండా తినేవారు కూడా ఉంటారు.

కానీ అలా చేయడం తప్పు.ఎందుకంటే పెరుగు స్వభావం వేడిగానే కాకుండా ఆమ్లంగా కూడా ఉంటుంది.

కాబట్టి ఏమి కలపకుండా అసలు తినకూడదు.అలా చేయడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.

Advertisement

ఇంకా చెప్పాలంటే పేరుగులో ఉప్పు లేదా పంచదార ఏది వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రి సమయంలో పెరుగు తినడం మానుకోవాలని ఆయుర్వేద నీపుణులు చెబుతున్నారు.

అలాగే ప్రతి రోజు పెరుగు తినే వారు అందులో తేనె, నెయ్యి( Honey, Ghee ), పంచదార, ఉసిరికాయలను కలుపుకొని తింటే ఇంకా మంచిదని చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఆహారాన్ని రుచిగా మార్చగల సామర్థ్యం ఉప్పుకి ఉంటుంది.అందువల్ల పెరుగులో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల పెద్దగా హాని జరగదు.మీరు రాత్రి పూట పెరుగును తినేటప్పుడు ఉప్పును కలుపుకొని తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు.

ఎందుకంటే ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇది శరీరం నుండి విషపూరిత మూలకాలను కూడా తొలగిస్తుంది.

భారత్‌లోని ఆ ప్రాంతంలో తిరుగుతూ కెమెరాకి చిక్కిన యూఎఫ్ఓ?
దండం పెడతాను నన్ను వదిలేయండి...పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!

అయితే పెరుగు స్వభావం ఆమ్లంగా ఉంటుంది.కాబట్టి ఇది కడుపులో గ్యాస్ ని సృష్టిస్తుంది.

Advertisement

అందువల్ల పెరుగులో ఎక్కువగా ఉప్పు కలపడం మానుకోవాలి.

అలాగే పెరుగులో ఉప్పు కలిపి( Salt ) రోజు తింటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు నెరిసి, చర్మం పై మొటిమలు ఏర్పడతాయి.అందువల్ల పెరుగులో ఉప్పు కలపడం మంచిది కాదు.

చక్కర గురించి మాట్లాడేటప్పుడు పెరుగులో చక్కెర కలిపి తినడం చాలా ప్రయోజనకరం అని చెబుతున్నారు.నిజానికి పేరుగులో పంచదార కలిపితే దాని రుచి ఇంకా పెరుగుతుంది.

అలాగే పెరుగులో బెల్లం కలపడం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అధిక రక్తపోటు ఉన్నవారు పెరుగులో ఉప్పు అసలు కలపకూడదు.

తాజా వార్తలు