టీవీ రియాలిటీషోతో ప్రేక్షకుల ముందుకి వస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ

టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.

తెలుగు, తమిళ్, హిందీ బాషలలో స్టార్ హీరోలందరి సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ దేశంలో ప్రస్తుతం ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉన్నాడు.

అతని నుంచి వచ్చిన పాటలన్నీ చాలా వరకు మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నవే.అన్ని రకాల పాటలకి ప్రాణం పోసిన దేవిశ్రీ ఈ మధ్యకాలంలో సినిమాలు భాగా తగ్గించేశాడు.

కేవలం ప్రాధాన్యత బట్టి మాత్రమే సినిమాలు చేస్తున్నాడు.రీసెంట్ గా ఉప్పెన సినిమాతో మ్యూజికల్ హిట్ కొట్టిన దేవిశ్రీ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నాడు.రంగ్ దే, గుడ్ లక్ సఖి సినిమాలు రిలీజ్ కి రేఅడు అవుతున్నాయి.ఎఫ్3, పుష్ప, ఖిలాడీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు విదేశాలలో మ్యూజిక్ కన్సర్ట్ లు దేవిశ్రీ ప్రసాద్ నిర్వహిస్తున్నాడు.

ఇప్పుడు సినిమాలు, ఈవెంట్స్ తో పాటు ఓ మ్యూజిక్ రియాలిటీ షో కూడా చేయబోతున్నాడు.జీ తమిళ్ ఛానెల్ కోసం ఆయన ఈ టీవీ షోను చేస్తున్నాడు.

Advertisement

దీని పేరు స్టార్ టు రాక్ స్టార్.దీనికి సంబంధించిన ప్రోమోను జీ ఛానెల్ విడుదల చేసింది.

మామూలుగా దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షోలలోనే తన ఎనర్జీ లెవల్స్ లో హై లెవల్ కికి ఈవెంట్ ని తీసుకుపోతాడు.అలాంటిది ఇప్పుడు రియాలిటీ షో అంటే కచ్చితంగా సూపర్ హిట్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

ఇక రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజికల్ రియాలిటీ షో అంటే ఇక రేటింగ్స్ కూడా గట్టిగానే వచ్చే అవకాశాలు ఉంటాయని గట్టిగా చెప్పుకుంటున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు