బీఆర్ఎస్ కు ఓటు వేస్తామని దళితవాడ తీర్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రానున్న శాసనసభ ఎన్నికలలో తమ ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేస్తామని ఎమ్మెల్యేగా కేటీఆర్ ను గెలిపించుకుంటామని తీర్మానం చేశారు.

ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో బుధవారం ఎస్సీ కాలనీలో ఉన్న మొత్తం కుటుంబాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటామని శపథం చేసి తీర్మానం పత్రాన్ని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరికి లకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు.దళితులకు దళిత బంధు ప్రవేశపెట్టిన మహనీయుడు కేసీఆర్ అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కుంబాల లక్ష్మారెడ్డి, తెడ్డు దేవరాజు,సుధమల్ల సురేందర్,తెడ్డు భూమ రాజయ్య, తెడ్డు పరశురాములు, రుద్రారపు చంద్రయ్య, సతీష్,కిట్టు, బాబు, నర్సింలు,రాజు, మధు, రాజవ్వ,ఎల్లవ్వ, సత్యవ్వ, పద్మ, లక్ష్మీ, మల్లవ్వ, ప్రమీల, నర్సవ్వ, విజయకుమార్, లక్ష్మీ, కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News