బుగ్గ రాజేశ్వర తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామం( Buggarajeswara Thanda )లో భానోత్ రాజు కి 20,500 రూపాయల చెక్కు మంజూరు కాగా అట్టి చెక్కును బానోత్ రాజు( Banoth Raju ) ఇంటికెళ్లి సర్పంచ్ అజ్మీర రజిత- తిరుపతి నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు రవి నాయక్ లు అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ), ప్రవేశ పెట్టినటువంటి పథకాలు పేదలకు ఎంతో అవసరమని అన్నారు.

ఐటీ శాఖ మంత్రులు కెటిఆర్ కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ అజ్మీర తిరుపతి నాయక్,నానావత్ రమేష్ నాయక్, అజ్మీర మోహన్, గూగులోత్ నరేష్, మహేష్,కడవత్ బాలు, పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News