రాజధానిపై మీరు స్పందించరేం?

ఏపీ రాజధాని విషయంలో రచ్చ జరుగుతూనే ఉంది.

గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించగా ఇప్పుడు వచ్చిన వైకాపా ప్రభుత్వం మాత్రం రాజధానిగా అమరావతి మాత్రమే కాకుండా వైజాగ్‌ మరియు కర్నూలు కూడా అంటూ ప్రకటించింది.

త్వరలోనే మూడు రాజధానులను ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మరియు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజా సంఘాలు మరియు పలు పార్టీల వారు అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.కాని తెలుగు సినిమా పరిశ్రమ వారు మాత్రం రాజధాని విషయంలో నోరు మెదపడటం లేదు.

రాజధాని విషయమై తెలుగు సినిమా వారు వెంటనే స్పందించాలని, అమరావతికి మద్దతుగా ముందుకు రావాలంటూ ఆందోళన కారులు డిమాండ్‌ చేస్తున్నారు.వెంటనే సినిమా పరిశ్రమ వారు రాజధానిపై స్పందించకుంటే రాష్ట్రంలో ఉన్న థియేటర్లలో సినిమాలు ఆడనివ్వము అంటూ ఆందోళనకారులు హెచ్చరించారు.

Advertisement

మరి ఇప్పుడైనా తెలుగు సినిమా స్టార్స్‌ రాజధాని విషయంలో స్పందిస్తారో చూడాలి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు