వడ్లు కొనలేక టిఆర్ఎస్ రాజకీయ డ్రామాల కోసం రోడ్డెక్కింది.పంటలపై ఆంక్షలు విధించిన చరిత్ర టిఆర్ఎస్ దే.
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని చెప్పింది వాస్తవం కాదా .? దేశంలో ఎక్కడా లేని కొనుగోలు పంచాయితీ తెలంగాణలో ఎందుకుంటుంది.సాగునీటి ప్రాజెక్టులకు లక్ష కోట్లుఖర్చుపెట్టింది.
పంట కొనక పోవడానికా.కేంద్రంపై నెపంతో రాజకీయ లబ్ది కోసం ఆరాటం పడుతోంది టిఆర్ఎస్ బిజెపి నేతలు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో రైతుల వడ్లను కొన లేక టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేయడానికి రోడ్డెక్కిందని, మక్కా జొన్న పంట వేయవద్దు , సన్న వడ్లు వేయాలి,వరి వేస్తే ఊరి అని పంటలపై ఆంక్షలు పెట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందని,రాష్ట్రం నుండి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో అగ్రిమెంట్ చేసుకొని, కొనుగోళ్ల పంచాయతీ పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తోందని, దేశంలో ఎక్కడా లేని కొనుగోళ్ల సమస్య తెలంగాణలో ఎందుకుంటుందని , రైతులను తప్పుదారి పట్టించడానికి రాజకీయ వేషాలు వేస్తుందని,ఇట్టి అంశంలో కేంద్రం నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మూర్ఖత్వమని బీజేపీ నేతలు మండిపడ్డారు.టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయడ్రామా కంపెనీగా మారిందని, తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజల ,ఉద్యోగుల , రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు.
లక్షల కోట్లు ఖర్చుపెట్టి సాగునీటి ప్రాజెక్టులు కట్టింది రైతుల పంటల కోసమైతే,పంట కొనుగోళ్లు ఎందుకు చేయరని ప్రశ్నించారు.ఇన్నాళ్లు రైతు పండించిన ప్రతీ గింజ తామే కోంటున్నామని ప్రగల్భాలు పలికిన కెసిఆర్ సర్కార్ మాట మార్చిందని,పంట కొనుగోళ్లలో అనవసర రాద్దాంతం చేస్తూ , టిఆర్ఎస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం రైతాంగాన్ని ఆగం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రాల వ్యవసాయంలో కేంద్రంజోక్యం చేసుకోదని, ఆయా రాష్ట్రాల వ్యవసాయ పాలసీ ప్రకారం నడుచుకుంటాయని, తెలంగాణలో వ్యవసాయ పాలసీ ఉందా.? పంటల ఆంక్షల పేరుతో తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పాలసీ ఉంది తప్ప, రైతాంగానికి ప్రయోజనం చేకూరే పద్ధతి లేదన్నారు .కేవలం రైతాంగానికి రైతు బంధు ఒక్కటే సర్వ రోగ నివారణి అన్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు .రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ తో కెసిఆర్ కు మతిభ్రమించింది.ప్రజలకు టిఆర్ఎస్ నమ్మకం పోయింది అని చెప్పిన తరువాతనే కెసిఆర్ కేంద్రం మీద ఎదురుదాడి మొదలుపెట్టారని, హడావుడిగా ఉద్యోగ ప్రకటన చేశారని బీజేపీ గుర్తు చేశారు .వ్యవసాయ రంగాన్ని రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేస్తుందని ,భూమి ఆత్మగౌరవానికి ప్రతీక అయితే ధరణీ తీసుకువచ్చి పల్లెల్లో ప్రశాంతత లేకుండా చేశారని ,అనేక భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటిని ప్రభుత్వ భూములు అని చెప్పి అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు.భూములు అమ్ముకోగా వచ్చిన డబ్బుతోనే జీతాలు ఇచ్చే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకు వచ్చారన్నారు.
యాసంగి పంట నూకలు ఎక్కువ అవుతాయని , క్వింటాల్ వరి ధాన్యంలో 65 కేజీల బియ్యం FCI కి పెడతారని ,100 కేజీ లకు 16 కేజీలు నూకలు అనుమతి ఇస్తారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్చెప్పారు.ఎండాకాలం అయితే సుమారు 25 కిలోలు వస్తాయి కావొచ్చు ఇందులో తేడా 9 కేజీలు మాత్రమే అనే విషయం గ్రహించాలన్నారు. నూకలు కూడా కేజీ 19/- అమ్ము తారని ,బియ్యం 29/- అమ్ము తారని,ఆ తేడా ఇస్తే మాకు నష్టం రాదని మిల్లర్లు అంటున్నా కెసిఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
యాసంగి బాయిల్డ్ రైస్ కొనుగోళ్లతో నూకలతో తేడా వచ్చినా సొమ్ము వందల కోట్లు దాటదని,రైతుల కోసం ఆ మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడం దారుణమన్నారు.మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ, కాశిపేట లింగయ్య లు కెసిఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికే కెసిఆర్ వడ్లు కొనలేని పరిస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు .రాష్ట్రంలో బిజెపిఎదుగుదలను కెసిఆర్ ఓర్వలేక పోతున్నారని,అందుకే వడ్ల పంట కొనుగోలు అంశాన్ని తెరమీదికి తెచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చేతికి వచ్చిన పంటను కొనలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని, వెంటనే ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రైతులు కెసిఆర్ వ్యవహారశైలిని గమనించాలని, రైతాంగం మీద కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో గుర్తించాలన్నారు.కెసిఆర్ కు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ బాయిల్డ్ రైసు కొనుగోలు మీద పెడితే బాగుంటుందని హితవు పలికారు.
ఇన్నేళ్లలో ఇప్పుడైనా బాయిల్డ్ రైస్ మిల్లర్ లతో కెసిఆర్ ఎప్పుడైనా వన్ మీటింగ్ పెట్టారా .? బాయిల్డ్ మిల్లర్లకు ప్రోత్సాహకాలు ఇస్తే బాయిల్డ్ రైస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని , ఆదిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు.తెలంగాణ రైతులారా కేసీఆర్ చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదని, కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ,నీళ్లు ఉండి కూడా వరి వేయలేని దుస్థితి, పంట కొనుగోలు చేయలేని స్థితిలో టిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యం అన్నారు.
మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేది, రైతుల మేలు కోరేది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అని,పంట కొనుగోలు చేయని, పంటలపై ఆంక్షలు విధించే రైతాంగ వ్యతిరేకి టిఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని గ్రహించాలన్నారు.బాయిల్డ్ రైస్ అంశంలో టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలు, ద్వంద వైఖరి అవలంబిస్తోందని,ఇట్టి అంశంలో రైతాంగం చైతన్యవంతులు కావాలని,కెసిఆర్ రాజకీయ డ్రామాలు గ్రహించి రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy