పూరీ పాడ్ కాస్ట్ మెసేజ్ కి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..!

రీసెంట్ గా జరిగిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనయుడు ఆకాష్ పూరీ కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ రాలేదని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆయన్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కొడుకు కోసం ఫారిన్ లో ఉన్నా తాను వస్తానని.

పూరీ ముంబై నుంచి రాలేకపోయాడని అన్నాడు బండ్ల గణేష్.అంతేకాదు పూరీ భార్య గురించి గొప్పగా మాట్లాడుతూ మధ్యలో ఎన్ని ర్యాంపులు, వ్యాంపులు వచ్చినా అంటూ బండ్ల గణేష్ సంచలన కామెంట్స్ చేశాడు.

గణేష్ చేసిన ఈ కామెంట్స్ కు నాలుక కొరుక్కోవడం మంచిది అంటూ పూరీ తన మార్క్ రిప్లై ఇచ్చాడు.అయితే పూరీ చేసిన పాడ్ కాస్ట్ మెసేజ్ కి మళ్లీ తిరిగి రిప్లై ఇచ్చాడు బండ్ల గణేష్.

ఇంతకీ బండ్ల గణేష్ ఏమని రెస్పాండ్ అయ్యారు అంటే.నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండే వాడు ఓడిపోతూనే ఉంటాడు అంటూ ఒక కోట్ వేశాడు.

Advertisement

ఇది ఖచ్చితంగా పూరీ పాడ్ కాస్ట్ కి బండ్ల మార్క్ కౌంటర్ అని అనుకుంటున్నారు.ఏది ఏమైనా చోర్ బజార్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ కి పూరీ మీద ఒకరకమైన నెగిటివిటీ ఏర్పడేలా చేసిందని చెప్పొచ్చు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు