వారిపై కేసు పెడతానంటున్న అల్లు శిరీష్...

సాధారణంగా సెలెబ్రెటీలు అంటే వారి చుట్టూ సోషల్ మీడియా కళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటాయి.

అందుకే సెలెబ్రెటీలు ఏ విషయాన్నైనా బాహ్య ప్రపంచంతో పంచుకోవాలంటే కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తారు.

ఒకవేళ అనాలోచితంగా ఏదైనా తప్పుగా సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తే వారికి నెటిజన్ల నుంచి ఇబ్బందులు తప్పవు.అయితే తాజాగా ఇలాంటి సంఘటనే అల్లు హీరో అల్లు శిరీష్ విషయంలో జరిగింది.

అయితే ఇతడు గతంలో ఓ ప్రముఖ హీరోని విమర్శిస్తూ  సోషల్ మీడియాలో ఓ పోస్టుని  షేర్ చేశాడు.అయితే అప్పుడెప్పుడో అల్లు శిరీష్ చేసిన ఈ పోస్టులకి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

దీంతో నెటిజన్లు అల్లు శిరీష్ ని ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో ఈ విషయం పై అల్లు శిరీష్ స్పందించాడు.

Advertisement

అయితే ఈ క్రమంలో తనని ట్రోల్స్ చేస్తున్నటువంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేగాక తాను విమర్శలు చేసింది ఒకలా అయితే దాన్ని ఉపయోగించి కొందరు మరో విధంగా నెగిటివిటీ సీరియెట్ చేస్తున్నారని నెటిజన్లపై మండిపడ్డారు.అలాగే ఇంకోసారి ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని అంతేగాకా వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేస్తానని హెచ్చరించారు.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లు శిరీష్ ఏ స్టార్ హీరోపై విమర్శలు చేసారనే విషయం గూర్చి మాత్రం చెప్పడం లేదు.

   .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు