న్యూస్ రౌండప్ టాప్ 20 

1.రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

రేపు హైదరాబాదులో తెలంగాణ నూతన సచివాలయం పరిసరాల్లో విధించారు.

ఉదయం 4 నుంచి రాత్రి 8:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

2.సచివాలయాన్ని సందర్శించిన హోం మంత్రి

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని హోంమంత్రి మహమూద్ ఆలీ సందర్శించారు.సచివాలయం మొదటి అంతస్తులో కేటాయించిన హోంశాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు.

3.సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నియామకం

తెలంగాణ సమాచార పౌరు సంబంధాల శాఖ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి కోరి అశోక్ రెడ్డిని నియమించారు.

4.ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం

భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం మే 4వ తేదీన ఢిల్లీలో ప్రారంభించనున్నారు.

5.రాజమండ్రి ఎంపీ విమర్శలు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టి రామారావు శత జయంతి వేడుకల పై రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు చేశారు.ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తోంది కపట ప్రేమ అని భరత్ విమర్శించారు.

6.ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు

కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.కాంగ్రెస్ ఇప్పటికే తనను 91 సార్లు దూషించిందని మోదీ మండపడ్డారు.

7.చంద్రబాబుకు పిచ్చి పట్టింది : కాకాని

Advertisement

చంద్రబాబుకు మతిమరుపు పెరిగిందని,  ఇప్పుడు పిచ్చి కూడా పట్టిందని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

8.పార్టీ బాధ్యతలు నుంచి తప్పుకున్న బాలినేని

వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యత నుంచి తప్పుకున్నారు.

9.ఐపీఎల్

నేడు కోల్ కతా, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.మధ్యాహ్నం 3:30 కి మ్యాచ్ ప్రారంభమయ్యింది.

10.రాహుల్ పరువు నష్టం కేసు విచారణ

నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ పై పరువు నష్టం కేసు విచారణ జరగనుంది.

11.పాలకమండలి సమావేశం

నేడు ఎస్ యూ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరగనుంది.

12.శ్రీవారి సేవలో గవర్నర్

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.అనంతరం తిరిగి విజయవాడకు ప్రత్యేక విమానంలో గవర్నర్ వెళ్ళనున్నారు.

13.టిడిపి మహానాడు

నేడు రాజమండ్రిలో మే 27, 28 తేదీల్లో జరుగునున్న టిడిపి మహానాడుకు వేదిక ఖరారైంది.ఈ వేదికను ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం పరిశీలించనుంది.

14.బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు

బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు బద్వేల్ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

15.ఇంటర్ ఫలితాలపై కలెక్టర్ సమీక్ష

కడప జిల్లాలో ఇంటర్ పరీక్ష ఫలితాలపై నేడు కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.

16.వివేకానంద రెడ్డి హత్య కేసు

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణలో భాగంగా కడపకు సిబిఐ అధికారులు రానున్నారు.

17.స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.

Advertisement

గన్నవరం స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వలంబ భారత్ పై రెండు రోజుల శిక్షణ జరగనుంది.దీనిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు.

18.హరీష్ రావు పర్యటన

నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.

19.షర్మిల పర్యటన

నేడు జనగామ జిల్లా, మహాబూబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు.

20.వరంగల్ లో మంత్రుల పర్యటన

నేడు సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ పర్యటించారు.

తాజా వార్తలు