తెలంగాణతో తన కుటుంబానికి సంబంధం ఉందని అందుకే నా చెల్లెలు అని ఇక్కడకు తీసుకువచ్చానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
గాంధీ ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఈ ఎన్నికల ప్రచారంలో అతిపెద్ద జోక్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను నవంబర్ 1 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది.
తెలంగాణలోని భూపాలపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
కెసిఆర్ తమ పార్టీ పథకాలను కాపీ కొట్టారని అందులో డౌటే లేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తుందన్న కేటీఆర్ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళన అంటున్నారని , అంటే చిన్న దొర తప్పు అంగీకరించినట్లేనా అని వైయస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
కాంగ్రెస్ బస్సు యాత్రపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు .కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ మరో కేసు నమోదయింది.అజహార్ నేతృత్వంలోని గత హెచ్సిఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సీఈఓ సునీల్ కాంతే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ కేటాయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డితో సమావేశం అయ్యారు.
ఇది ప్రజల తెలంగాణ కాదు, దొరల తెలంగాణ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బిఆర్ఎస్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
దివ్యాంగుల పింఛన్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు 200 పింఛన్ ఇస్తోందని అదే తెలంగాణ 4,016 ఇస్తున్నామని అంటే 20 రెట్లు ఎక్కువ అని కేటీఆర్ అన్నారు.
సామాజిక న్యాయ బస్సు యాత్ర రాష్ట్ర మంతటా నిర్వహిస్తామని వై నీడ్ ఏపీ సీఎం జగన్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ బస్ యాత్ర లో అపశృతి చోటుచేసుకుంది.
బైక్ ర్యాలీ లో పాల్గొన్న కొండా సురేఖ అదుపు తప్పి కిందపడిపోయారు.దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో బిజెపి , బీఆర్ఎస్, ఎం ఐ ఎం కలిసి పనిచేస్తున్నాయని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
త్రిపుర గవర్నర్ గా బిజెపి సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఆర్ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ వేదికపై సందడి చేసిన తారక్ అదే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ లో కొత్త సభ్యుడిగా ఎంపికయ్యారు.
సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాలు ఫ్రిజ్ చేయాలన్న సిఐడి ఫిటిషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్లే 60 ఏళ్లు గోసపడ్డాం.ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy