లాస్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన రవి.. రాత్రైందంటూ..?

సంవత్సరాలు గడుస్తున్నా బుల్లితెరపై రవిలాస్య జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

గొడవ పడి కొన్ని కారణాల వల్ల విడిపోయిన బుల్లితెర జోడీ రవిలాస్య రీఎంట్రీలో మళ్లీ సత్తా చాటుతున్నారు.

ఈ జోడీ కామెడీ స్టార్స్ అనే షోలో కామెడీ స్కిట్లు చేస్తుండగా ఆ స్కిట్లు ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు ఈ జోడీకి బుల్లితెర ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో అంతకంతకూ పెరుగుతోంది.దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈ జోడీ బుల్లితెరకు దూరంగా ఉన్నప్పటికీ రీఎంట్రీలో మాత్రం ఈ జోడీ మ్యాజిక్ ను రీ క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

లాస్య బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో కూడా రవి ఇతర కంటెస్టెంట్లకు సపోర్ట్ చేసినప్పటికీ లాస్యకు మాత్రం అస్సలు సపోర్ట్ చేయలేదు.అయితే బిగ్ బాస్ నిర్వాహకుల నిబంధనల ప్రకారం బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కొన్ని నెలల పాటు టీవీ ఛానెళ్లలో స్టార్ మా ఛానెల్ ప్రోగ్రామ్స్ కే పని చేయాల్సి ఉంటుంది.

ఈ మధ్య కాలంలో రవిలాస్య జోడీ హిట్టైన సినిమాలకు కమెడీ స్టార్స్ షోలో పేరడీలు చేస్తున్నారు.తాజాగా కామెడీ స్టార్స్ ఎపిసోడ్ ప్రసారం కాగా రవి బాలయ్య గెటప్ లో ఎంట్రీ ఇస్తారు.రవి అందరినీ కొట్టగా శేఖర్ మాస్టర్ వాళ్లందరూ మీవాళ్లు అని చెబుతాడు.

Advertisement

లాస్య బంగారు కొండ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి అచ్చం నయనతారలా ఉన్నాను కద అడగగా రవి మీ ఇంట్లో అద్దం కొనుకొని పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పానని అడుగుతాడు.

ఆ తరువాత రాత్రైంది మనకేమైనా ఉందా.? అంటూ రవి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పగా నువ్వేసిన గెటప్ గుర్తుందా ఇంతకీ అని లాస్య పంచ్ వేస్తారు.రవి వెంటనే తానేమన్నానని తినడానికి అనం, పప్పు ఏమైనా ఉంటే పెట్టమని అడుగుతాడు.

సింహాకు స్పూఫ్ గా చేసిన స్కిట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు