శ్మశానంలో చోటు చేసుకున్న విషాదం.. కాలుతున్న చితిలో పడి పాపం.. !

మరణం ప్రతి జీవికి సహజంకానీ కొందరికి వచ్చే మరణం మాత్రం బాధాకరంగా ఉంటుంది.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా ఇలాంటి ఘోరం జరిగింది.

కాలుతున్న చితిలో పడి ఓ వృద్ధురాలి మరణించింది.ఇలా శ్మశానంలో చోటు చేసున్న విషాద ఘటన గురించి తెలుసుకుంటే.

An Old Woman Fell Nto A Burning Pit And Died Srikakulam, Ichapuram, Old Woman,

ఇచ్చాపురం పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన జమున మహంతి (72) అనే వృద్దురాలు అనారోగ్యంతో మృతి చెందగా ఆమెకు కండ్రవీధి శ్మశానవాటికలో గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు.కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్పా గౌడవీధికి చెందిన రెయ్యి చంద్రమ్మ (66) మహిళ, అందరు అక్కడి నుండి వెళ్లిన తర్వాత మండుతున్న చితిలో దూకేసింది.

అయితే ఈ విషయాన్ని ఒక పశువుల కాపరి గుర్తించాడు.అప్పటికి ఆ మహిళను కాపాడటానికి చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో ఆ చితిలోనే కాలిపోయిందట.

Advertisement

కాగా ఇదే అదే శ్మశాన వాటిక వద్ద ఆమె మృతదేహానికి పంచనామ నిర్వహించి అత్యక్రియలు పూర్తి చేశారట బంధువులు.ఇకపోతే చంద్రమ్మ భర్త ఈ మధ్య కాలంలో మరణించాడని, అప్పటి నుండి ఆమె మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తుందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.

కానీ మండుతున్న చితిలో పడి మరణించడం ఎంత దారుణం.

Advertisement

తాజా వార్తలు