కార్మికులందరూ ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -ఎంపీపీ పడిగల మానస రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ( Tangallapalli )మార్కండేయ దేవస్థాన అవరణలో కార్మిక శాఖ, కామన్ సర్వీస్ సెంటర్ (సి స్ సి ) హెల్త్ క్యాంప్ వారి ఆధ్వర్యంలో మే డే సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పడిగల మానస మాట్లాడుతూ లేబర్ కార్డు కలిగివున్న భవన నిర్మాణ కార్మిక సోదరులందరూ 50 రకాల పరీక్షలు దాదాపు 15000 రూపాయల వరకు ఉచితంగా చేస్తున్న సందర్భంగా ఇట్టి సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీపీ కోరారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఎగమామిడి వెంకటరమణారెడ్డి, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజబింకార్ రాజన్న, మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపెల్లీ ఆనందం, మండల కురుమ సంఘం అధ్యక్షులు ఏగుర్ల కరుణాకర్, యూత్ నాయకులు అంకారపు మహేష్, కార్మికులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News