ధనుష్ తో విడాకుల తర్వాత ఐశ్వర్య ఏం చేస్తుందో మీకు తెలుసా?

ధనుష్ ఐశ్వర్య విడాకుల ప్రకటన ధనుష్ అభిమానులతో పాటు ఐశ్వర్య, రజనీకాంత్ అభిమానులను చాలా బాధ పెడుతోంది.18 సంవత్సరాల పాటు సంతోషంగా జీవనం సాగించిన ధనుష్ ఐశ్వర్య విడిపోతారని అభిమానులు కలలో కూడా భావించలేదు.

గతంలోనే ధనుష్ ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరిగింది.

ధనుష్ ఐశ్వర్య విడిపోవడం గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా సరైన స్పష్టత మాత్రం రావడం లేదు.ధనుష్ తండ్రి కస్తూరి రాజా ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని కామెంట్లు చేయగా ధనుష్ అభిమానులను కూల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చెప్పి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.

ధనుష్ ఐశ్వర్యల విడాకుల వార్తలు నిజం కాకపోతే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.వరుసగా సెలబ్రిటీ జోడీలు విడాకులు తీసుకుంటూ చేస్తున్న ప్రకటనలు సామాన్య ప్రజల జీవనంపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.

ఈ నెల 17వ తేదీన ఒకే సమయంలో ధనుష్, ఐశ్వర్య విడాకుల గురించి ప్రకటన చేశారు.మరోవైపు విడాకుల ప్రకటన తర్వాత ఐశ్వర్య షూటింగ్ తో బిజీ అయ్యారని సమాచారం.

Advertisement

ఐశ్వర్య డైరెక్షన్ లో వాలెంటైన్స్ డే స్పెషల్ సాంగ్ తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ సాంగ్ డైరెక్షన్ వర్క్ తో ఐశ్వర్య బిజీ అయ్యారని సమాచారం.

మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఐశ్వర్య ఈ సాంగ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టారని బోగట్టా.ప్రేన అరోరా ఈ సాంగ్ కు ప్రొడ్యూసర్ కాగా ఐశ్వర్య ఈ సాంగ్ కు సంబంధించి నిర్మాతతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.ఐశ్వర్య, ధనుష్ విడాకుల ప్రకటన తర్వాత వర్క్ పై దృష్టి పెట్టడం గమనార్హం.

హైదరాబాద్ లో ఈ సాంగ్ షూటింగ్ జరగనుందని సమాచారం.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు