కేసీఆర్ కు ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు చెందిన శరద్ మర్కడ్ బాబాసాహెబ్ నియమితులయ్యారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ యాక్టివిటీస్‌ను కేసీఆర్ ముమ్మరం చేసిన సమయంలో షేట్కారీ సంఘటన్‌కు చెందిన పలువురు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేరారు.

శరద్ మర్కడ్ కూడా ఏప్రిల్ 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో లాంఛనంగా చేరారు.పూణె యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ పూర్తిచేసిన శరద్‌కు ఒక ఐటీ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చినా దాన్ని తిరస్కరించి బీఆర్ఎస్‌లో చేరారు.

గత నెల 1వ తేదీన చేరిన ఆయనకు నెల రోజుల్లోనే సీఎం కేసీఆర్‌కు ప్రైవేట్ సెక్రటరీ పోస్టింగ్ ఇస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈ నెల 4 న ఉత్తర్వులు జారీచేశారు.

ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధికి నటుడు రావు రమేష్ భారీ విరాళం..!!
Advertisement

Latest Hyderabad News