ఆత్మహత్య చేసుకుంటానని ప్రభాస్ ఫ్యాన్ వార్నింగ్.. రాధేశ్యామ్ డైరెక్టర్ ఏమన్నారంటే?

స్టార్ హీరో ప్రభాస్ కు తెలుగు హీరోలలో ఏ హీరోకు లేని స్థాయిలో మార్కెట్ ఉంది.

జపాన్ దేశంలో ప్రభాస్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ఈ స్టార్ హీరో సినిమా విడుదలై రెండు సంవత్సరాలు గడిచినా ఈ హీరోపై అభిమానం అణువంతైనా తగ్గలేదు.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా ఆంక్షలు, ఇతర కారణాల వల్ల మేకర్స్ ఈ సినిమాను మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.

రాధాకృష్ణ కుమార్ నాలుగు సంవత్సరాలు కష్టపడి రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించారు. రాధేశ్యామ్ తెలుగు ట్రైలర్ కు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో హిందీ ట్రైలర్ కు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ రావడం గమనార్హం.

తాజాగా రాధాకృష్ణ కుమార్ అభిమానులతో ముచ్చటించారు.అభిమానులు అడిగిన ప్రశ్నలకు రాధాకృష్ణ కుమార్ సమాధానాలు ఇచ్చి రాధేశ్యామ్ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచారు.

Advertisement

ప్రభాస్ అభిమాని ఒకరు తన ప్రశ్నకు దర్శకుడు సమాధానం ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించగా అలా చేయడానికి ప్రయత్నిస్తే వచ్చి కొడతానని రాధాకృష్ణ కుమార్ అన్నారు.ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత రాధేశ్యామ్ విడుదల ఉంటుందని రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు.ఒక నెటిజన్ రాధేశ్యామ్ మూవీలోని హీరోయిన్ రోల్ కు యాటిట్యూడ్ ఎక్కువా? అని ప్రశ్నించారు.

రాధేశ్యామ్ లో ప్రేరణ ప్రొఫెషనల్, స్వీట్ హార్ట్ అని దర్శకుడు కామెంట్లు చేశారు.టీజర్, ట్రైలర్ లో చూసిన లుక్స్ తో పోలిస్తే సినిమాలో ప్రభాస్ లుక్స్ మరింత అద్భుతంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు.బాధల్ని చిరునవ్వుతో పోగొట్టి ప్రపంచాన్ని అందంగా మార్చే వ్యక్తి ప్రభాస్ అని దర్శకుడు కామెంట్లు చేశారు.

రాధేశ్యామ్ క్లాస్ సినిమా అయినప్పటికీ ప్రభాస్ ను ఇష్టపడే మాస్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కొరకు ఎదురుచూస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు