బాలకృష్ణ-పూరీ కాంబినేషన్ రిపీట్! బోయపాటి తర్వాత అదేనా

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ కంప్లీట్ గా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న బాలకృష్ణ మొదటిస ఆరి టాలీవుడ్ లో హీరోల్లో ఎవరు చేయని సాహసవంతమైన పాత్ర చేయబోతున్నట్లు టాక్.ఇందులో అఘోరాగా బాలయ్యబాబు కనిపిస్తాడని తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నెక్స్ట్ ఏ దర్శకుడుతో సినిమా చేస్తాడు అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.

బోయపాటి సినిమా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బాలయ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా వచ్చింది.

Advertisement

అందులో బాలకృష్ణ ఎన్నడూ లేని విధంగా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు.అదంతా పూరీ మహత్యం అని చెప్పాలి.

ఆ సమయంలోనే మరల ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని పూరీ స్పష్టం చేశాడు.ఈ మధ్యలో ఇస్మార్ట్ శంకర్ తో పూరీ బిజీ కావడం.

మరల ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడం.అటు బాలయ్య కోసం బోయపాటి సినిమాకి కమిట్ అవడంతో కాస్తా గ్యాప్ వచ్చింది.

వీరి సినిమాలు పూర్తయిన వెంటనే మరల పూరీ-బాలకృష్ణ కాంబినేషన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి పూరీ జగన్నాథ్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!
Advertisement

తాజా వార్తలు