టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chief Chandrababu Naidu ) వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారన్న కొడాలి నాని( Kodali Nani ) సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమేనని పేర్కొన్నారు.ప్రస్తుతం ఏపీకి ఉన్న రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో రూ.2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనని ఆరోపించారు.ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు రూ.2.5 లక్షల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు.ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులను తాకట్టు పెడతారని ఆయన తెలిపారు.