డ్రంకెన్ డ్రైవ్ కేసు లో 10 మందికి శిక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 10 మందికి జ్యూడిషల్ 1st క్లాస్ మేజిస్ట్రేట్ వేములవాడ కోర్ట్ శిక్ష విధించింది.

కాగా 10 మందిలో ముగ్గురికి ఒక రోజు జైలు శిక్ష తో పాటు వెయ్యి రూపాయలు జరిమానా, మిగతా ఏడుగురికి ఒక్కొక్కరికి 1500/- రూపాయలు జరిమానా విధించటం జరిగింది.

ఈ సందర్బంగా రూరల్ ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపకూడదు అని అది మీకు మరియు ఎదుటి వారికి ప్రమాదం అని, మీకు ప్రమాదం జరిగితే అది మీ కుటుంబం కి తీరని లోటు అని జరిమానా లు తాత్కాలికం అని మీలో మంచి ప్రవర్తన కోసమే అని, మార్పు మీలోనే జరగాలి అని కోరారు.

సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబిబిఎస్ ఫస్టియర్ విద్యార్థుల ఫ్లాష్ మాబ్

Latest Rajanna Sircilla News