జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద సేవాసమితి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఝాన్సీ అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులతో కలిసి ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకొని విద్యార్థులకు రాఖీ పండుగ విశిష్టత ను తెలియజేశారు.

అనంతరం మిఠాయి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ ఝాన్సీ, అమర్ నాథ్, స్వర్ణలత, స్వప్న రజిత,లావణ్య,మమత, స్వామి వివేకానంద సేవాసమితి సభ్యులు పాటి సుధాకర్, లింగంపెల్లి మధు, దురిశెట్టి రాజు, జాల గంగాధర్, మూడపెల్లి ముకేశ్, పంచేరుపుల దివ్యసాగర్, లొకోజు సతీష్, మోతుకుపెల్లి మధు లు, గ్రామస్తులు బండారి సత్తయ్య, కొంతం దేవయ్య లు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు

Latest Rajanna Sircilla News