హాస్పిటల్ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా..!!

వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

రెండు మేజర్ ఆపరేషన్లు జరగటంతో ఆమెను ఇవాళ ఐసియు నుంచి సాధారణ వార్డుకు తరలించారు వైద్యులు.

ఈ సందర్భంగా రోజా భర్త సెల్వమణి మాట్లాడుతూ.ఎమ్మెల్యే రోజా కోలుకుంటున్నారని, రెండు వారాల పాటు డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలని తెలిపినట్లు స్పష్టం చేశారు.

పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే విధంగా ఆస్పత్రికి ఎవరు రావడానికి ప్రయత్నాలు చేయవద్దని పేర్కొన్నారు.త్వరలోనే రోజా డిశ్చార్జి అవుతారని సెల్వమణి తెలిపారు.

రోజా కి ఆపరేషన్ కావటంతో ఒకపక్క రాజకీయ కార్యక్రమాలు మరోపక్క ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ షో కి కొన్నాళ్ళు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే గత ఏడాదే ఈ శస్త్రచికిత్సలు జరగాల్సి ఉండగా కరోనా, ఎన్నికల వల్ల వాయిదా పడినట్లు రోజా భర్త సెల్వమణి పేర్కొన్నారు.

Advertisement

 ఇటీవల జరిగిన పంచాయితీ, పట్టణ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తిరుపతిలో భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలిపించడం లో ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో కృషి చేయడం జరిగింది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు