కొత్త పాలసీతో అమెజాన్‌ ఉద్యోగులకు చిక్కులు!

కరోనా నేపథ్యంలో కొంత మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.దాదాపు చాలా మంది పరిస్థితి అంతే.

మరికొంత మంది బిజినెస్‌లు కూడా మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడింది.అయితే, కొన్ని సంస్థలు లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఉద్యోగుల్లో మార్పులు చేపట్లాలని భారీ ప్రక్షాళనలు చేపట్టింది.

ఈ జాబితాలో ప్రస్తుతం ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా చేరింది.ఆ వివరాలు తెలుసుకుందాం.

పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్స్‌ (పీఐపీ) అమెజాన్‌ ఉద్యోగులకు కొత్త టెన్షన్‌ మొదలైంది.ఒకవేళ వారి పేరు ఈ పీఐపీ జాబితాలో ఉంటే వాళ్లు కచ్చితంగా వేరే జాబ్‌ వెతుక్కోవాల్సిందేనట.

Advertisement

ఈ విషయంలో అమెజాన్‌ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉందట.అమెజాన్‌ ‘ఫోకస్‌’ పెర్ఫామెన్స్‌లో భాగంగా మెనేజర్‌ సదరు ఉద్యోగిని మానిటర్‌ చేస్తున్నట్టు ఎటువంటి వార్నింగ్‌ ఇవ్వడు.

దీన్ని సీటల్‌ టైమ్స్‌ పత్రిక ధ్రువీకరించింది.ఎందుకంటే ఈ పరీక్షలో అమెజాన్‌ ఎటువంటి వార్నింగ్‌ ఇవ్వకుండా ఉద్యోగి పెర్ఫామెన్స్‌ను మానిటర్‌ చేస్తారు.

ఈ ప్రక్రియంతా జరిగినపుడు కనీసం ఆ ఉద్యోగి పీఐపీ జాబితాలో ఉన్నట్లు కూడా తెలీదు.అంత జాగ్రత్తగా చేస్తారు.

ఆ ఉద్యోగి పీఐపీ జాబితాలో ఉన్నట్లు అధికారికంగా తెలిసేలోగా అమెజాన్‌లో సదరు ఉద్యోగి జాబ్‌ అప్పటికే పోయినట్లు.అమెజాన్‌ ఈ నయా పాలసీ ప్రకారం కేవలం అమెజాన్‌ మెనేజర్‌కు అడిగి తెలుసుకునే వరకు ఈ పీఐపీ ‘ఫోకస్‌’లో సదరు ఉద్యోగి ఉన్నట్లు తెలియకూడదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ ప్రక్రియను అమెజాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్యావేక్షిస్తుంది.ఒకవేళ ఉద్యోగి ఫోకస్‌ జాబితాలో ఉంటే జాబ్‌లో నుంచి తీసివేయడానికి ఒత్తిడి కూడా చేయవచ్చు.తన లక్ష్యంలో భాగంగా అమెజాన్‌ ప్రతిఏడు దాదాపు 6 శాతం తమ సిబ్బందిని తొలగిస్తుందని అమెజాన్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డాక్యుమెంట్స్‌ నివేదికల ద్వారా తెలుస్తోంది.

Advertisement

ఈ సంస్థకు మొత్తానికి 1/3 వంతు తక్కువ ప్రతిభ కలిగిన ఉద్యోగులను తమకు తెలియకుండానే ఫోకస్‌ టూల్‌లో భాగంగా వారిని కంపెనీ నుంచి తొలగించడమే ప్రధాన లక్ష్యం.

కొంత మంది ఉద్యోగులకైతే వారు ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకున్నాక.వారిని ఈ జాబితాలో చేర్చినట్లు కూడా వారికి తెలియదు.వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం పెర్ఫామెన్స్‌ని బేస్‌ చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు తెలిసింది.

దీంతో సదరు ఉద్యోగులు బాధపడినా ప్రయోజనం లేదు.విషయం తెలుసుకున్నాక కొందరి పరిస్థితి మరీ ఎమోష్‌నల్‌గా ఉంటుందట.

తాజా వార్తలు