షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు..: సజ్జల

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై( YS Sharmila ) వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు.

షర్మిల వాడిన భాష సరికాదని పేర్కొన్నారు.

షర్మిల వ్యాఖ్యలు తామందరికీ బాధ కలిగించాయని సజ్జల తెలిపారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు.

సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసిందన్నారు.

అలాగే వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.వైఎస్ ఆశయాలకు సీఎం జగన్( CM Jagan ) కట్టుబడి పని చేస్తున్నారని తెలిపారు.

Advertisement

ఏపీని విడగొట్టిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.తెలంగాణలో షర్మిల ఏం చేశారని ప్రశ్నించిన సజ్జల అక్కడి నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు