సాధారణంగా అందరూ జన్మను ఆనందంతో స్వాగతిస్తూ ఉంటారు.కానీ మరణం( Death ) బాధాకరమైనదిగా చాలామంది ప్రజలు భావిస్తారు.
కానీ పుట్టుక సాధారణమైనట్లే మరణం కూడా సాధారణ ప్రక్రియ అని పండితులు చెబుతున్నారు.భగవద్గీత( Bhagavad Geeta ) ప్రకారం మరణం అనేది ఆత్మ పరివర్తన ప్రక్రియ అని కూడా చెబుతున్నారు.
ఒక వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆత్మ తన శరీరాన్ని మరణం ద్వారా భర్తీ చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది మరణానికి ఎంతో భయపడుతూ ఉంటారు.
దాని వెనుక కారణం మరణ సమయంలో అనుభవించే బాధలు.
అలాగే మరణ సమయంలో చాలామంది తన గొంతును కూడా కోల్పోతారు.మరణం సంభవించే ముందు ఆ వ్యక్తి ఏడవడం మొదలు పెడతాడు.మరణంలో ఒక వ్యక్తి తన స్వరాన్ని ఎందుకు కోల్పోతాడో ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ పురాణం( Garuda Puranam ) ప్రకారం వ్యక్తి మరణించే ముందు అతనిలో దివ్య దృష్టి పెరుగుతుంది.ఆ వ్యక్తి ప్రపంచంలోనే ప్రతిదాన్ని చూడడం మొదలుపెడతాడు.తన మరణించే ముందు మొత్తం జీవితంలోని సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటాడు.
ఒక క్షణంలో ఆ వ్యక్తి కన్నుల ముందు మొత్తం జీవితం మళ్ళీ కనిపిస్తుంది.
వెంటనే అతను తన కొత్త జీవిత ప్రయాణాన్ని మొదలు పెడతాడు.మరణ సమయంలో యమదూతలు ఆ వ్యక్తి వద్దకు వచ్చి వెంటనే అతని ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తారు.ఆ సమయంలో ఆ వ్యక్తి 100 తేళ్లు కుట్టిన బాధను అనుభవిస్తాడని గరుడ పురాణంలో ఉంది.
దీనితో పాటు ఒక వ్యక్తి నోరు లోపల నుంచి పొడి దనం మొదలవుతుంది.ఎందుకంటే అతని లాలాజలం బయటకి వస్తూ ఉంటుంది.గరుడ పురాణం ప్రకారం పాపులా ప్రాణశక్తి శరీరం దిగువ భాగం నుంచి వెళుతుంది.
అలాగే ఒక వ్యక్తి చివరి ఘడియ వచ్చినప్పుడు యమ దూతలు అతని వద్దకు వస్తారు.యమదూతలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు.
అటువంటి యమా దూతలను చూసి పాపులు భయపడి మలవిసర్జన చేయడం మొదలు పెడతారని గరుడ పురాణంలో ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy