పెళ్లితో ఒక్కటైన ప్రేమ జంట.. ఫోటోలు వైరల్!

గత కొన్ని రోజుల నుండి ప్రేమలో ఉన్న జంట పెళ్లితో ఒకటయ్యారు.

గురువారం రోజున తమ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన గుత్తాజ్వాల తమిళ హీరో విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలు వినిపించేది.

ఇక వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు.ప్రముఖ భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, హీరో విశాల్ తో గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకుంది.

ఇక మొయినాబాద్ లో మధ్యాహ్నం వివాహం చేసుకున్నారు.అంతే కాకుండా ఉగాది రోజున తమ పెళ్లి పత్రికను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా ఆహ్వానాలు పంపించడం లేదని తెలిపారు.ఇదిలా ఉంటే ఈ జంటకు ఇది రెండో పెళ్లి.గతంలో వీరిద్దరూ వేరే వేరే పెళ్లిళ్లు చేసుకోవడం కొన్ని మనస్పర్థల వల్ల వీళ్లు వాళ్లతో విడిపోయారు.2010లో విష్ణు విశాల్ రజనీ నటరాజన్ ను పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2018లో విడిపోయారు.

Advertisement

ఇక 2005లో గుత్తా జ్వాల మరో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను పెళ్లి చేసుకుంది.ఇక వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు ఏర్పడగా 2011లో విడిపోయారు.

ఇక ఆ తర్వాత విశాల్ తన సోదరి పెళ్లి వేడుకలో గుత్తా జ్వాల తో తొలిసారిగా పరిచయం పెంచుకోగా ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.ఇక ఈ జంట పెళ్లికి ముందే మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.

అంతే కాకుండా అక్కడ దిగిన ఫోటోలను కూడా గుత్తా జ్వాల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు