గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసిన వినోద్ కుమార్

బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్బోయినపల్లి( B.Vinod Kumar ) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వినోద్ కుమార్రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొండయ్య, ఎంపీపీ వేణుగోపాల్, సెస్ డైరెక్టర్ సుధాకర్, ప్యాక్స్ చైర్మన్ సురేందర్ , పార్టీ సీనియర్ నాయకులు జోగినపల్లి రవీందర్ రావు, ప్రేమ్ సాగర్ రావు, లచ్చిరెడ్డి, స్థానిక సర్పంచ్ లతాశ్రీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి వినోద్ కుమార్ బోయినపల్లి మండల కేంద్రంలో గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి ఓటు వేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వినోద్ కుమార్ ప్రజలకు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీల( Congress party, BJP ) నాయకులు చేసే మోసపూరిత మాటలను నమ్మవద్దని, చేతల ప్రభుత్వమైన బీ ఆర్ ఎస్ పార్టీని మరోసారి ఆదరించాలని వినోద్ కుమార్ ప్రజలను కోరారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News