‘వినయ విధేయ రామా’ సెన్సార్‌ పూర్తి... సెన్సార్‌ బోర్డ్‌ వారు ఏమన్నారంటే..!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబు అవుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్టు సమాచారం.

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకోగా ‘వివిఆర్‌’నే చివరగా ఈ తతంగంను పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు యూ.ఎ సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.బోయపాటి సినిమా కాబట్టి కాస్త భారీ ఫైట్స్‌ ఉంటాయి.

సో క్లీన్‌ యూ అనేది బోయపాటి చిత్రాలకు తగనిది అని చెప్పవచ్చు.

ఈ చిత్రానికి ఒక్క కట్‌ ఇవ్వకుండా సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు యూ.ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారట.సింగిల్‌ కట్‌ లేకపోవడంతో చిత్ర యూనిట్‌ కూడా ఖుషీగా ఫీల్‌ అవుతున్నారు.

Advertisement

‘వినయ విధేయ రామా’ చిత్రం చాలా బాగుందని, కచ్చితంగా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుందని, రామ్‌చరణ్‌ ఖాతాలో మరో మంచి హిట్‌ చేరుతుందని సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు అభిప్రాయాలు వెల్లడిరచారు.దాంతో ఈ చిత్రానికి ఇప్పటి నుండే పాజిటివ్‌ వైబ్స్‌ వస్తున్నాయి.

‘రంగస్థలం’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న చెర్రీ ఈ చిత్రంతో కూడా భారీ హిట్‌ కొట్టాలని తెగ ప్రయత్నిస్తున్నాడు.అందుకే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గోంటున్నాడు.పలు ఇంటర్య్వూలలో మాట్లాడుతూ సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచుతున్నారు.

ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వానీ రొమాన్స్‌ చేసింది.ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు