మరోసారి నాగచైతన్యతో జతకడుతున్న రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరల వరుస సినిమాలతో బిజీ అవుతుందని ఆమెకి వస్తున్న అవకాశాలు చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరగా చేస్తున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా కథ మొత్తం రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా పర్వాలేదని టాక్ సొంతం చేసుకుంది.

Advertisement

అందులో రకుల్ చేసిన ఇన్నోసెంట్ పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది.మరల విక్రమ్ థాంక్యూ సినిమా కోసం చైతూతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది.ఆ పాత్ర కోసం ప్రియా శంకర్ భవానీని విక్రమ్ ఎంపిక చేశాడు.

ప్రస్తుతం చైతూ లవ్ స్టోరీ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ థాంక్యూ సినిమాని సెట్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.

త్వరలో ఈ సినిమా అఫీషియల్ షూట్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంది.మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా ఆఫర్ సొంతం చేసుకోవడం ద్వారా టాలీవుడ్ లో మళ్ళీమెల్లగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది.

రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయిన తమిళ్ స్టార్ డైరెక్టర్...
Advertisement

తాజా వార్తలు