వైరల్ అవుతున్న మెగా హీరో న్యూ ఫోటోషూట్..!

టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన అభిమానం ఉంది.

చిరంజీవితో మొదలైన మెగా కుటుంబం నుండి ఇప్పటి వరకు 10 మందికి పైగానే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు.

ఈ మధ్యనే మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.

వైష్ణవ్ తేజ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఉప్పెన సినిమా చేసాడు.తొలి సినిమాతోనే 100 కోట్ల మార్క్ అందుకున్న ఘనత కూడా వైష్ణవ్ తేజ్ కే దక్కింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. వైష్ణవ్ తేజ్ కు మాత్రమే కాదు ఈ సినిమా దర్శకుడికి, హీరోయిన్ కు కూడా ఇది మొదటి సినిమానే.

Advertisement

ఈ సినిమా హిట్ అవ్వడంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో జంగిల్ బుక్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కూడా ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం.

అయితే ఈ రెండు సినిమాలతో పాటు వైష్ణవ్ తేజ్ ఇప్పుడు జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా వైష్ణవ తేజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంభందించిన అప్డేట్ లు కానీ తన కొత్త లుక్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

తాజాగా వైష్ణవ్ తేజ్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.ఈ ఫోటో షూట్ లో వైష్ణవ్ కోటు వేసుకుని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇప్పుడు ఈ ఫోటోలను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు