పన్ను ఎగ్గొట్టడం కోసం తోటి నటుడిని కేసులో ఇరికించిన కమెడియన్ వడివేలు

వడివేలు.తమిళంలో స్టార్ కమెడియన్.

తెలుగు జనాలకు కూడా ఈయన సుపరిచిత నటుడు.

తన కామెడీతో జనాలను ఎంతగానో అలరించే వడివేలుకు తాజాగా న్యాయం స్థానం షాక్ ఇచ్చింది.

అక్రమ ఆస్తుల కేసులో ఆయనను వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.దీంతో ఈ స్టార్ కమెడియన్ చిక్కుల్లో పడ్డాడు.

గడిచిన కొంత కాలంగా వడివేలుకు అంతగా సినిమా అవకాశాలు రావడం లేదు.పలు వ్యక్తి గత కారణాల మూలంగా ఆయన సినిమాల్లో నటించడం లేదు.

Advertisement

ప్రస్తుతం ఆయన ఇతర సమస్యలను ఎదుర్కోబోతున్నాయి.అక్రమ ఆస్తుల కేసులో విచారణకు రావాలని వడివేలను ఎగ్మూర్ న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది.

గతంలో వడివేలు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి.ఇందులో పలు ఆస్తుల వ్యవహారాలు బయటకు వచ్చాయి.

తాంబారం దగ్గర మూడున్నర ఎకరాల స్థలాన్ని అమ్మిన విషయాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు అధికారులు.అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థల విషయంలో తన తోటి నటుడు సింగముత్తుపై వడివేలు కేసు వేశాడు.

అప్పటి నుంచి ఈ కేసు ఎగ్మూర్ కోర్టులో నడుస్తుంది.కొంతకాలం క్రితమే ఈ కేసు విచారణకు రావాలని వడివేలుకు కోర్టు సమన్లు అందించింది.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

అయితే ఆయన పలు కారణాలతో కోర్టు విచారణకు రాలేదు.

Advertisement

తాజాగా ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది.ఈ స్థలాన్ని తాంబారం సమాపంలో శేఖర్ అనే వ్యక్తికి వడివేలు అమ్మాడని కోర్డుకు చెప్పాడు.పన్ను ఎగవేత కోసమే సింగముత్తుపై అనవసర ఆరోపణల చేస్తున్నారని కోర్టుకు వివరించాడు.

ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.ఈ సారి విచారణకు వడివేలు తప్పకుండా హాజరు కావాల్సిందేనని వెల్లడించింది.

ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించాడు.

తదుపరి విచారణకు వడివేలు హాజరై ఏం చెప్తాడు అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది.ఒకవేళ తను చెప్పింది అవాస్తవం అయితే వడివేలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

తాజా వార్తలు