తంగళ్ళపల్లి మండల కేంద్రంలో విషాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చిన్న అద్దె ఇంట్లో అద్దెకుంటూ.

కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నేడు తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.

గత మూడు సంవత్సరాలుగా అనారోగ్య పరిస్థితి వల్ల తల్లి మంచానికే పరిమితం కాగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.దీంతో అన్నా చెల్లెలు సాయి గాయత్రిలిద్దరూ అనాధలుగా మారారు.

అద్దె ఇంట్లో ఉంటూ ఓ కిరాణా షాప్ లో పనిచేస్తున్న సాయి కుటుంబాన్ని పోషించుకుంటూ నెట్టుకొస్తున్నాడు.చాలీచాలని జీతంతో కుటుంబాన్ని తన భుజాలపై వేసుకున్నాడు.

నేడు తల్లి మృతి చెందడంతో దహన సంస్కారాలకు కూడా చేతులో చిల్లిగవ్వలేదు.ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

దాతలు ఎవరైనా ఉంటే సహకరించగలరు.ఫోన్ పే.9014328556 ఈ నెంబర్ సాయి ది తనకు ఫోన్ పే చేయవలసిందిగా కోరుతున్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News