దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో సరిగ్గా ఐదేళ్ల క్రితం వ్యక్తిగత పని నిమిత్తమై బయటికి వచ్చినటువంటి ఓ యువతిని ఆరుగురు మృగాళ్లు లాంటి వ్యక్తులు ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి మర్మాంగాలు వద్ద తీవ్రంగా గాయపరచడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో మరణించింది.
ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంతో కలకలం సృష్టించింది.
అయితే అప్పటికే నిందితులను గుర్తించి అరెస్టు చేసినప్పటికీ ఇప్పటివరకు వారికి పడినటువంటి శిక్షను అమలు చేయలేదు.దీంతో దేశంలోని న్యాయవ్యవస్థపై పలు ప్రజా సంఘాలు మరియు సోషలిస్టు కమ్యూనిటీ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ రోజున ఉదయం ఐదు గంటలకు నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలు చేశారు.దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ రోజుకి నిర్భయ కి సరైన న్యాయం జరిగిందంటూ ట్వీట్ లు పెడుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు సమస్యలపై స్పందించే టాలీవుడ్ యాంకర్ అనసూయ కూడా ఈ నిర్భయ ఘటన నిందితులకు ఉరిశిక్ష అమలు చేసిన అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.ఇందులో భాగంగా న్యాయం జరగడం కొంతమేర ఆలస్యం అయినప్పటికీ ఖచ్చితమైన న్యాయమే జరిగిందంటూ హిందీ భాషలో రాసి పోస్ట్ చేసింది.అలాగే ఈ విషయంపై మంచు హీరో మంచు మనోజ్ కూడా స్పందిస్తూ దారుణంగా అత్యాచారానికి గురై మరణించిన నిర్భయ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శాంతి శాంతి శాంతి అంటూ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.
అలాగే ఈ విషయంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.ఇందులో భాగంగా లేట్ గా శిక్ష అమలయ్యినా నిర్భయపై సరైన న్యాయం జరిగిందని పేర్కొన్నాడు.అయితే ఈ విషయం పై ప్రముఖులే గాక సామాన్య ప్రజలు కూడా స్పందిస్తూ, కొన్ని చోట్ల సంబరాలు కూడా చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy