తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ గెలవటానికి అడ్డదారులు తొక్కుతున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.పోలింగ్ సరళిలో అవకతవకలు జరుగుతున్నాయని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందని వారు ఓట్లు వేస్తున్నారని, దొంగ ఓట్లు పడుతున్నాయని విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక వైసిపి అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి .వస్తున్న వార్తలపై స్పందించారు.
వెంకటగిరిలో ఉపఎన్నిక పోలింగ్ సరళిని పరీక్షించడానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ… వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం. తప్పుడు ప్రచారమని ఖండించారు.
తిరుపతి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందే గురుమూర్తి మన్నసముద్రంలో కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు 50 శాతానికి పైగానే పోలింగ్ శాతం నమోదైనట్లు సమాచారం.